- Advertisement -
ముంబై : సామాజిక ఉద్యమనేత అన్నాహజారే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష సాగించడానికి సిద్ధమైనప్పటికీ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తన డిమాండ్లు కొన్నిటిని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడమే దీనికి కారణంగా ఆయన వివరించారు. అంతకు ముందు ఆయన తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో శనివారం నుంచి నిరాహార దీక్ష సాగిస్తానని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని తాను డిమాండ్ చేస్తున్నానని, కానీ కేంద్రం ఆమేరకు సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అయితే తన డిమాండ్లు కొన్నిటిని నెరవేరుస్తాని కేంద్రం ఒప్పుకుందని, అలాగే రైతుల బతుకులు బాగుపర్చడానికి వీలుగా కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని అన్నాహజారే చెప్పారు.
- Advertisement -