Monday, April 29, 2024

తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ‘జెయుఎస్‌టి’ ఆవిర్భావం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునాదిగా మరో స్వతంత్ర జర్నలిస్ట్ సంఘం పురుడు పోసుకుంది. ఆదివారంనాడు హైదరాబాద్ నాంపల్లి టిఎన్‌జిఒ భవన్‌లో హైదరాబాద్‌తో పాటు పది ఉమ్మడి జిల్లాల జర్నలిస్ట్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొండల్ గౌడ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో జర్నలిస్టు యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ(జెయుఎస్‌టి) ఏర్పడింది..సంఘం కన్వీనర్‌గా ఎంవి.రమణ,కో కన్వీనర్లుగా పివి.శ్రీనివాస్, జమాల్పూర్ గణేష్, బిజిగిరి శ్రీనివాస్, శశికాంత్, మల్లీశ్వరి, నాంపల్లి మురళి, సలహాదారుగా కొండల్ రావు ఎన్నికయ్యారు.

గుంటిపల్లి వెంకట్ స్టేట్ కో కన్వీనర్‌తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. స్టేట్ అడహాక్ కమిటీ సభ్యులుగా కొండల్ గౌడ్(హైదరాబాద్), గోపాలకృష్ణ(కరీంనగర్), నర్సింహచారి(నిజామాబాద్),లక్ష్మీనారాయణ(రంగారెడ్డి), బస్వరాజు(మహబూబ్‌నగర్),యోగానంద్ రెడ్డి(మెదక్),క్రాంతి(నల్గొండ),రాజేష్(ఆదిలాబాద్) ఎన్నికయ్యారు.అడ్‌హాక్ కమిటీ సభ్యులు సంబంధిత జిల్లాల ఇంఛార్జీలుగా వ్యవహరిస్తారు. ఏ రాజకీయ పార్టీ పట్ల అనుకూలంగానో , వ్యతిరేకంగా గానో వ్యవహరించమని, ఫక్తు జర్నలిస్టుల ప్రయోజనాలే పరమావిధిగా పనిచేస్తామని రాష్ట్ర సమావేశం తీర్మానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News