Sunday, April 28, 2024

చరిత్ర సృష్టించిన అన్షుమాలిక్

- Advertisement -
- Advertisement -

Anshu Malik reaches final in World Wrestling Championships

 

ఒస్లొ (నార్వే): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మాలిక్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల 57 కిలోల విభాగం సెమీఫైనల్లో అన్షు మాలిక్ సంచలన విజయం సాధించింది. సెమీస్‌లో ఉక్రెయిన్ రెజ్లర్ సొలొమియాను 110తో చిత్తు చేసింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన అన్షు ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు పట్టును కాపాడుకున్న అన్షు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో అమెరికా రెజ్లర్ హెలెన్ మారొలిస్‌తో అన్షు తలపడుతుంది. ఇక ఫైనల్‌కు చేరడంతో అన్షుకు ఇప్పటికే రజత పతకం ఖాయమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News