Tuesday, May 7, 2024

ఎపిలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూన్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలో 7 పేపర్లు ఉండనున్నాయి.. ఒక్కో పేపర్ కు 100 మార్కులగా నిర్ణయించారు. సైన్స్ లో 50 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండనున్నాయి. ఇక, మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఎపిలో జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

AP 10th and Inter Exams 2021 Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News