Wednesday, May 1, 2024

ఐపిఎల్‌కు ఆసీస్ గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

CA to grant NOCs for players to IPL 2021

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్‌)-2021 సీజన్‌లో ఆడేందకు తమ ప్లేయర్స్ కు అనుమతిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఎ) తాత్కాలిక సిఈఒ నిక్‌ హాక్లీ తెలిపారు. తమ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప, బోర్డు నిరభ్యంతర పత్రాలు(ఎన్‌వోసి) మంజూరు చేయడంలో ఎటువంటి సమస్య ఉండదన్నారు.  ఆ సమయంలో తమ ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని విధిగా పరీక్షించి అమోదిస్తామని నిక్ వెల్లడించారు. కాగా, గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో మొత్తం 19మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరగబోయే ఐపిఎల్‌-14వ సీజన్‌ ఏప్రిల్ నుంచి‌ భారత్‌లో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తులు చేస్తోంది. ఇక, ఆయా ప్రాంఛైజీలు పలువురు క్రికెటర్లను వదులుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన ఆటగాళ్ల వేలం చెన్నైలో జరగనుంది.

CA to grant NOCs for players to IPL 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News