Monday, May 13, 2024

ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: దేశంలో కలవరపెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎంటరైంది. ఆదివారం ఎపిలో తొలి ఒమిక్రాన్‌  కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా విజయనగరానికి వచ్చిన వ్యక్తికి.. మొదట ముంబైలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయగా కొవిడ్‌ నెగెటివ్‌ రాగా.. విజయనగరానికి వచ్చిన తర్వాత మళ్లీ చేసిన టెస్టులో కోవిడ్ పాజిటీవ్ గా తేలింది. దీంతో అతని శాంపిల్స్ ను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. అందులో ఒమిక్రాన్‌గా గుర్తించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని.. మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

AP Reports First Omicran Case 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News