Wednesday, May 1, 2024

మస్క్ ‘ఎక్స్’కు అమెరికా కంపెనీల షాక్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్:ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘ఎక్స్’(మాజీ ట్విట్టర్)కు అమెరికన్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎక్స్‌లో తమ వాణిజ్య ప్రకటనలు( యాడ్స్) నిలిపివేస్తున్నట్లు గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్, వాల్ డిస్నీ, ఒరాకిల్, ఐబిఎం,కామ్‌కాస్టో, బ్రావో టెలివిజన్ నెట్‌వర్క్, యూరోపియన్ కమిషన్స్, పారామౌంట్ గ్లోబల్, వార్నర్‌బ్రోస్ డిస్కవరీ, లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఎక్స్‌లో యూదులకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులకు ఎలన్ మస్క్ మద్దతు పలకడంపై దుమారం చెలరేగింది.

మస్క్ తీరుపై అగ్రరాజ్యం అమెరికా సైతం తీవ్రంగా మండిపడింది.ఎక్స్ వేదికగా యూదుల వ్యతిరేక యూజర్లతో మస్క్ పదేపదే సంభాషణలు జరిపారు. ఈ నేపథ్యంలోనే శ్వేత జాతీయులు, యూదులను కించపరిచేలా ఓ యూజర్ చేసిన పోస్టుపై మస్క్ స్పందిస్తూ ‘ సరిగ్గా చెప్పారు’ అని పోస్టు చేయడంపై విమర్శలు వెల్లవెత్తాయి. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం కూడా మస్క్ రియాక్షన్ యూదుసామాజిక వర్గాన్ని ప్రమాదంలో పడేస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలోనూ మస్క్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News