Monday, May 13, 2024

తిరుచ్చిపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి 7:30 గంటలకు అమ్మవారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడవీధులు విహరించి భక్తులను కటాక్షించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై , ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం . ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News