Wednesday, May 1, 2024

తిరుమల బ్రహ్మోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ టిక్కెట్ల కోటా 600లకు పెంచాలని ఛైర్మన్‌కు వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తిరుమల పర్యటనలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. 2వ రోజు చిన్నశేష వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి లతో కలిసి  సోమవారం ఆయన పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం మలయప్పస్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఆలయ మాడ వీధులలో జరిగిన ఊరేగింపులో భాగంగా ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక శాఖ నూతనంగా టూరిజం బస్సులను ఏర్పాటు చేయటం ద్వారా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు. తాము అందిస్తున్న మెరుగైన సేవల వల్ల భక్తుల తాకిడి పెరిగిన క్రమంలో దీనిని దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలంగాణ టూరిజం శాఖకు ప్రస్తుతం ప్రతిరోజు విడుదల చేస్తున్న 300 శీఘ్ర దర్శనం టికెట్ల కోటాను 600 టికెట్లకు పెంచాలని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. మంత్రి చేసిన విజ్ఞప్తి పై చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించి అందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News