Monday, April 29, 2024

ఆసీస్ లక్ష్యం 210

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో లంక 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని లంక ఉంచింది. పథుమ్ నిశాంక(61), కుశాల్ పెరీరా(78) పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అడమ్ జంపా నాలుగు వికెట్లు తీసి లంక వెన్నువిరిచాడు.  చరితా అసలంకా 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన లంక బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అడమ్ జంపా నాలుగు వికెట్లు, స్టార్క్, హజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశాడు.

Also Read: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడి మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News