Monday, May 13, 2024

ప్లాట్ల పేరిట చీటింగ్ చేసిన నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Arrest of accused who cheated in name of plot
అమాయకులను రూ.5కోట్లు ముంచిన ఘనుడు

హైదరాబాద్: ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఎండి అబ్దుల్ రషీద్, మరి కొందరు కలిసి ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. దాదాపుగా 15మంది బాధితుల వద్ద నుంచి రూ.5కోట్లు తీసుకుని ప్లాట్లు ఇప్పించకుండా మోసం చేశారు. దీంతో ఎండి అలం ఖాన్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు.

Arrest of accused who cheated in name of plot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News