Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. సోమవారం దుబ్బాక ని యోజకవర్గం మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన జి. రాజు (38) అనే వ్య క్తి కత్తితో దాడి చేశాడు. నిందితుడు రాజు ప్రభాకర్ రెడ్డికి షేక్‌హ్యాండ్ ఇస్తానని చెప్పి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఊహించని పరిణామంతో తెరుకున్న ప్రభాకర్‌రెడ్డి గన్‌మెన్ నిందితుడి చేతిలో నుంచి కత్తిని లాక్కున్నాడు. అప్పటికే ప్రభాకర్‌రెడ్డి కడుపు భా గంలో తీవ్ర గాయమైంది. ఘటన స్థలంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ప్రభాకర్‌రెడ్డి అనుచరులు నిందితున్ని పట్టుకొని చితకబాది పో లీసులకు అప్పగించారు. వెంటనే తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి కి తరలించారు.

విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలివెళ్లారు. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థ్ధితిని అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి యశోద ఆసుపత్రి వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీ నిర్వహించారు. ఆయనకు చిన్న పేగుకు నాలుగో చోట్ల గాయాలయ్యాయని, 15 సెంటీ మీటర్లపై కడుపును కట్ 10 సెంటీ మీటర్ల చిన్నపేగును తొలగించి శస్త్రచికిత్స నిర్వహించినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రక్తం అంతా కడుపులో పేరుకుపోయిందని, అందుకే 15 సెంటీ మీటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశామని వివరించారు. లోపల రక్తం పెరుకుపోవడం, పేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయిందని చెప్పారు. గాయపడిన ప్రభాకర్‌రెడ్డిని వెంటనే గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోద వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఐసియులో ఉంచి.. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డికి గాయం తీవ్రంగా ఉందని శస్త్రచికిత్స సమయంలో గుర్తించిన వైద్యులు, ఇన్ఫెక్షన్ సోకకుండా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. మరో పది రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ప్రభాకర్‌రెడ్డికి సిఎం కెసిఆర్ పరామర్శ
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. సోమవారం రాత్రి సిఎం కెసిఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లి ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి,ధైర్యం చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్‌రావు
ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి కోలుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు ఈ సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఆయన నారాయణఖేడ్‌కు వెళ్లకుండానే వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరారు. ఎంపి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కత్తి గాటు ఎంత వరకు ఉందో పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు హుటాహుటిన యశోద ఆసుపత్రి చేరుకొని కారు దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి వైద్యులతో మాట్లాడారు. కార్యకర్తలెవరూ సంయమనం కోల్పోకూడదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హరీశ్ రావు సూచించారు. రాజకీయాల్లో హత్యా రాజకీయాలు పనికి రావు అని, ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన కెటిఆర్
దాడికి గురైన మెదక్ ఎంపీ, బిఆర్‌ఎస్ దుబ్బాక ఎంఎల్‌ఎ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం : సిపి శ్వేత
ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎంపి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. నిందితున్ని కార్యకర్తలు పోలీసులకు అప్పగించారని, కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించామని సిపి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News