గ్రెగ్ చాపెల్
మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్లోనే కోహ్లిని మించిన కెప్టెన్ లేడని ప్రశంసించాడు. కోహ్లి రాకతో టీమిండియా ఆట స్వరూపమే మారిపోయిందన్నాడు. భారత క్రికెట్కు కొత్త దిశను చూపిన ఘనత కోహ్లికి మాత్రమే దక్కుతుందన్నాడు. గంగూలీ కెప్టెన్సీతో పోల్చితే కోహ్లి సారధ్యం చాలా భిన్నమైందన్నాడు. కోహ్లి దూకుడు టీమిండియాను బలమైన జట్టుగా తీర్చిదిద్దిందన్నాడు. ఒకప్పుడూ ఆస్ట్రేలియా క్రికెటర్లలోనే ఇలాంటి దూకుడు కనిపించేదన్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించిపోయాడన్నాడు. గతంలో గంగూలీ కూడా దూకుడుగా వ్యవహరించే వాడని, అయితే గంగూలీ సత్తా కేవలం భారత్లోనే ఎక్కువగా ప్రభావం చూపిందన్నాడు. కానీ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఇంటా బయట వరుస సిరీస్లు గెలుచుకున్న విషయాన్ని చాపెల్ గుర్తు చేశాడు.