Tuesday, April 30, 2024

రామమందిరం ప్రారంభానికి ముందే అయోధ్యలో విమానాశ్రయం పూర్తి

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ పూర్తికానుంది. రామమందిర ప్రారంభానికి నెలరోజుల ముందే అంటే డిసెంబర్ 15 నాటికి ఎయిర్‌పోర్టు తొలి దశ పూర్తవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదిత్యనాథ్ శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విమానాశ్రయ నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని, డిసెంబర్ 15 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని చెప్పారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయమంత్రి వికె సింగ్‌తో కలిసి విమానాశ్రయాన్ని సందర్శించిన సిఎం ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని అన్నారు. కాగా విమానాశ్రయంలో అయోధ్యసాంస్కృతిక నైతికత ప్రతిబింబించేలా కృషి చేశామని కేంద్రమంత్రి సింధియా చెప్పారు.గంటకు 2 3 విమానాలను నిర్వహించగల సామర్థంలో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశ నిర్మాణంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News