Thursday, May 2, 2024

ఎరుమేలి వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై అయ్యప్పస్వాముల ఆందోళన

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : శబరిమలైకు మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీస్‌లు నిలిపివేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీస్‌లు వాహనాలను నిలిపివేశారు. దీంతో అఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ వాహనాలను అనుమతించాలని ఎపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పలువురు అయ్యప్పస్వాములు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీస్‌ల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్‌లు, కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని అయ్యప్పలు ఆరోపిస్తున్నారు. దీంతో పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్లు నిలిచిపోయాయి. ఈనెల 27తో మండల పూజలు ముగియనున్నాయి. వరుస సెలవులు కావడంతోకూడా భక్తులు భారీగా శబరిమలైకు వస్తున్నారు. అనూహ్య రద్దీ కారణంగా వర్చువల్ క్యూ బుకింగ్‌లను తగ్గించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చర్యలను చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News