Friday, April 26, 2024

అమ్మా నేను చనిపోతున్నా… బిటెక్ విద్యార్థి సూసైడ్ సెల్ఫీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి ఎంటెన్స్ ఎగ్జామ్‌లో ర్యాంక్ రాలేదని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పెనుగంచిప్రోలుకు చెందిన తిరుమేలేష్ అనే విద్యార్థి(23) ఓ ప్రైవేటు కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎంఎస్ చేయడానికి ఎంటెన్స్ ఎగ్జామ్స్ రాస్తే సెలెక్ట్ కాలేదని మానసికంగా కుంగిపోయాడు. దీంతో “అమ్మా నేను జీవితంలో విఫలం చెందాను.. ఎంత ప్రయత్నించినా చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నందుకు బాధతో సెల్సీ తీసి కాలేజీ భవనం పైనుంచి దూకాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. తనయుడు నేత్రాలను తల్లిదండ్రులు ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News