Friday, May 3, 2024

బిటెక్ యువకుడు బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

suicide

మనతెలంగాణ/మన్సూరాబాద్: బిటెక్ విద్యార్ది సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన దేవరాయ యాదయ్య, భారతమ్మ గత 25 యేండ్ల క్రితం మన్సూరాబాద్ నాంచారమ్మ బస్తీకి వలస వచ్చి ఉంటున్నారు. ఈ దంపతులకు దేవరాయ శ్రీధర్(22) బిటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ చేస్తున్నాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరేసికోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం శ్రీధర్ సోదరుడు డోరు కోట్టడంతో తలుపుల తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగోట్టి చూసేసరికి ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్దలానికి చేరుకోని పరిశీలించగా.. సూసైడ్ నోటు లబించింది. సూసైడ్ నోట్‌లో.. నాచావుకు కారణం ప్రక్కింట్లో ఉన్న ధశరథ ఆయన భార్య అనుసూర్య.  నా జీవితం నాశనం కావడానికి వీరిద్దరే కారణమని రాసి పెట్టడం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

B Tech Student attempt Suicide in LB Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News