- Advertisement -
భోపాల్: పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళను మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2019లో అగర్ గ్రామానికి చెందిన యువకుడిని యువతి పెళ్లి చేసుకుంది. వివాహం జరిగి సంవత్సరమైన పిల్లలు కావడంలేదని మరది, భర్త కలిసి కళ్లు అనే మంత్రగాడు వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు పిల్లలు పుట్టిస్తానని మాయమాటలు చెప్పి రూమ్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే ఆ మహిళ బైర్సియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి మంత్రగాడు, భర్త, మరిదిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -