Sunday, May 5, 2024

బహదూర్‌పల్లిలో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు…..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. పూర్తిగా కాలి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతుడు ఎవరు? అనేది తెలిస్తే నిందితులను పట్టుకోవడానికి వీలు కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News