Tuesday, April 30, 2024

వచ్చే నెల నుంచి మార్పులివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం అనేక నియమాలను మార్చబోతోంది. ఇందులో జిఎస్‌టి నియమాలు వంటివి ఉన్నాయి.

జిఎస్‌టి నిబంధనలు
ఇప్పటికే జిఎస్‌టిలోని పలు నిబంధనలను మార్చారు. వ్యాపారులు కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదుని 7 రోజులలోపు ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. మే 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల కోసం వస్తువులు, సేవా పన్నులో ఈ మార్పు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలు ఐఆర్‌పిలో ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ధర
ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ రేటు కూడా మారుతుంది. ఎల్‌పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఏప్రిల్‌లో తగ్గించారు. కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.92 వరకు తగ్గించాయి. ఢిల్లీలో సిలిండర్ తగ్గింది. ఢిల్లీలో వాటి ధరల్లో ఏడాదిలో రూ.225 ఉపశమనం లభించింది.

బ్యాంకు సెలవులు
బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. మే నెలలో బ్యాంకులకు 11 రోజుల సెలవులు ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే బ్యాంకు సెలవుల్లో మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ పనిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు వీటి ద్వారా డబ్బును కూడా బదిలీ చేయవచ్చు.

సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు
సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు ప్రతి నెల మొదటి తేదీ లేదా మొదటి వారంలో సవరిస్తారు. ఢిల్లీ, ముంబైలలో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. మే ప్రారంభంలో సిఎన్‌జి ధరలలో మార్పు ఉండవచ్చు. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు తగ్గించారు. కొత్త ధరలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా సిఎన్‌జి ధరను తగ్గించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News