Tuesday, May 7, 2024

దేశమంతా బేరోజ్‌గార్ మేళా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఏటా రెం డు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మించి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ధ్వ జమెత్తారు. అసలు దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బిజెపి అని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి నియామకాల గురించి మా ట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి పాలనలో.. మొత్తం భారతదేశమే ఒక బేరోజ్ గార్ మేళాగా మారిపోయిందని విమర్శించారు.

మోదీ ఇచ్చిన హామీలన్నీ పేకమేడలేనని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో మోదీకి దేశప్రజలు ప్రధానిగా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచే దేశంలో యువతకు కష్టాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ దేశంలోని యువతీ యువకులను నిలువునా మో సం చేశారని మండిపడ్డారు. గత తొమ్మిదేళ్లలో ఏ డాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనందుకు యువతకు బిజెపి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత ప్రధాని మోదీ హయాంలోనే నమోదుకావ డం అత్యంత సిగ్గుచేటు అని కెటిఆర్ విమర్శించా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా

ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం తమది అని పేర్కొన్నారు. ఇప్పటికే 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసి.. మరో 70,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా పూర్తికాబోతోందన్నారు. అసలు నియామక ప్రక్రియలో జాప్యానికి కారణమే బిజెపి అని పేర్కొన్నారు. పకడ్బంధీగా నిర్వహిస్తున్న పరీక్షలకు భంగం కలిగించేందుకు ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్రకు తెరలేపింది బిజెపియేనని తెలంగాణ ప్రజలకు తెలుసు అని చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసేలా పేపర్ లీకేజీకి పాల్పడింది బిజెపి పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడే అనే విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుంచుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. మరోవైపు అక్రమ కేసులు వేయిస్తూ.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్న బిజెపి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీఐఆర్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రద్దుచేసిన బిజెపి ప్రభుత్వం యువతీ యువకుల భవిష్యత్తును దెబ్బతీసిందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల్లో ఒకటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ అమలు చేసి ఉంటే.. ఎంతోమంది యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించేవని అన్నారు. ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ బిడ్డలకు కొ త్తగా అవకాశాలు లభించేవని, వారికి అన్యాయం చేసిన బిజెపికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అలాగే దశాబ్దాల కల అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కూడా కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడిందని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఒక్కనాడైనా తెలంగాణ విభజన హక్కు ల గురించి కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని కెటిఆర్ సూటిగా ప్రశ్నించారు. సహాయ మంత్రిగా కాకుండా.. నిస్సహాయ మంత్రిగా మారిపోయిన కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ యువతకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడం వల్ల యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో సరికొత్త పంథాలో ఇలాంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల దేశ యువతకు తీవ్ర నష్టం జరుగుతోందని స్పష్టం చేశారు.

కిషన్‌రెడ్డికి కెటిఆర్ సవాల్

దమ్ముంటే గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఉ ద్యోగాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భర్తీ చేసిందా కిషన్ రెడ్డి చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు. ముఖ్యంగా బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందో లెక్కలతో సహా చెప్పగలరా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి భాగస్వామిగా ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీలెన్ని..? అనే విషయంపై శ్వేత పత్రం విడుదల చేసి దమ్ముందా..? అని నిలదీశారు. 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పైన, తమ పార్టీ పైన విమర్శలు చేయడం కిషన్‌రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా..? అని పేర్కొన్నారు. ఓవైపు కేంద్రంలో ఉన్న ఖాళీలను నింపకుండా.. ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నియామక పరీక్షలను హిందీలో నిర్వహించడం వల్ల వివిధ రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తెచ్చే వరకూ మీకు కనీసం సోయి లేకపోవడం దురదృష్టకరమని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకునే కుట్రలకు ఇప్పటికైనా కిషన్ రెడ్డి ముగింపు పలికాలని కెటిఆర్ అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టడంతోపాటు.. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని సూచించారు. కీలక రంగాల్లో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News