Sunday, April 28, 2024

అచ్చంపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : నియోజకవర్గ ప్రాంత ప్రజలకు నూతన అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 7 నూతన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించి, ప్రధాన రహదారి గుండా ఎన్‌టిఆర్ స్టేడియం వరకు అంబులెన్స్‌లతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక నిధులను కేటాయించి చెంచు ఆదివాసుల బడుగు బలహీన వర్గాల ప్రజల వైద్యం కోసం ఎలాంటి ఆందోళన చెందకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో వైద్య విధాన పరిషత్ అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని, అవసరమైన సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి నా వంతు సహాయ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలో అధునాతనమైన వైద్య సేవలను అందించడానికి అదే విధంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలు విస్తరించడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను కేటాయించి వారికి మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఈ నూతన వాహనాలు ఉపయోగపడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాలు ముదిరాజ్, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు సుంకరి నిర్మల బాలరాజు, రమేష్ రావు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News