Friday, April 26, 2024

బుక్ ఫెయిర్‌లో సిఎం కెసిఆర్ పేరిట ప్రత్యేక స్టాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే రెండో అతి పెద్ద పుస్తక ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సుమారు 340 స్టాల్స్‌తో డిసెంబర్ 22 నుండి జనవరి 1 వరకు ఈ పుస్తక ప్రదర్శన జరగనుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. స్కూల్ విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది.

ఈ బుక్ ఫెయిర్‌లో సిఎం కెసిఆర్ పేరిట ఓ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. సిఎం కెసిఆర్ చేసిన వివిధ రచనలు, రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఈ స్టాల్లో ప్రదర్శనగా ఉంచనున్నారు. అలాగే కేంద్ర హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు కానుంది. ఇక వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు ఇక్కడ లభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News