- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని షహీన్బాగ్ నిరసనల్లో కాల్పులతో కలకలం రేపిన కపిల్ గుజ్జార్ భారతీయ పార్టీలో చేరడం అత్యంత వివాదాస్పదమైంది. దీనిపై సోషల్మీడియాలో విమర్శలు రావడంతో కొన్నిగంటల్లోనే గుజ్జార్కు బిజెపి ఉద్వాసన పలక వలసి వచ్చింది. ఆనాటి కాల్పుల సంఘటనలో ఆయన పాత్ర గురించి తమకేమీ తెలియదని బిజెపి ఘజియాబాద్ విభాగం వెల్లడించింది. అయితే ఆయన నేరపూరిత చర్యగురించి తెలిసిన తర్వాత బిజెపి ఆయనను బయటకు పంపడానికి నిర్ణయించింది. షహీన్బాగ్ కాల్పుల సంఘటన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 1న పోలీసులు గుజ్జార్ను అరెస్టు చేశారు. రెండు రోజులు ఆయన పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు.
- Advertisement -