పశ్చిమబెంగాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి సంబంధించి దేశంలో పలుచోట్ల నిరసనలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో బిజెపి వ్యవసాయ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు చేస్తూ, కవాతు చేపట్టి దాని ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తోంది. అదే సమయంలో, ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాయి. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని నోడాఖాలి గ్రామంలో శనివారం వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కవాతు చేస్తున్న బిజెపి కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టిఎంసి కార్యకర్తలు తమపై దాడి చేశారని బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
#WATCH West Bengal: BJP workers, who were carrying out a march in support of Farm Laws yesterday in Nodakhali village of South 24 Parganas district, were attacked allegedly by TMC workers. Seven people arrested. (03.10.2020) pic.twitter.com/rpk3qsSyK8
— ANI (@ANI) October 4, 2020