Saturday, May 4, 2024

27న ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల జాతర

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఈ నెల 27 ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉస్మానియా ఆసుప త్రి ఓపీ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు బోనాల జాతన ఉత్సవ కమిటీ అధ్యక్షు లు వి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్సవ కమిటి ప్రతినిధులతో మాట్లాడుతూ మంగళ వారం ఉ దయం 11 గంటలకు ఆసుపత్రి ఆర్‌ఃఎంవోల నేతృత్వంలో అమ్మవారికి తొట్టెల ఊరేగింపు, బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు తెలిపా రు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెంటెండెంట్ డాక్టర్ బి నాగేందర్, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రివేణి, సివిల్ సర్జన్ ఆ ర్‌ఎంఓ= 1 బి డాక్టర్ శేషాద్రి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుప త్రి వైద్యులు, సి బ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కమిటీ ప్రతినిధులు ప్రతియేటా బోనాల ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వ హిస్తున్న రమేష్‌ను శాలువాతో ఉత్సవ కమిటీ అధ్యక్షులు రమేష్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతి నిధులు సిహెచ్ సాయి రాం, జి అశోక్, జి జగన్, పి దేవేందర్, బి మహేందర్, ఏ ధన్‌రాజ్, కమల్, సూర్య ప్రకాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News