Thursday, May 2, 2024

కన్న కొడుకును కొట్టి చంపిన కసాయి తల్లి

- Advertisement -
- Advertisement -

Boy died after thrashed by mother in Hyderabad

మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: భర్తపై కోపంతో కన్న కొడుకును కొట్టి చంపిన కాసాయి తల్లి ఈ హృదయ విదారక సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లాకు చెందిన సురేష్, ఉదయ దంపతులకు ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఉమేష్(3) ఉన్నాడు. వీరు బతుకు ధెరువు కోసం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ సురేష్ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భర్త సురేష్ పనికి వెళ్ళిన సమయంలో భాస్కర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. దీంతో సురేష్ భార్యను పలుమార్లు హెచ్చరించినప్పటికి ఆమెలో మార్పు రాలేదు.

దీంతో కుమారుడు ఉమేష్ తో కలిసి రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళి భగత్‌సింగ్‌ నగర్‌లో నివాసం ఉంటూ భాస్కర్‌తో సహజీవనం చేస్తుంది. అయితే తన కుమారుడిని చూడటానికి సురేష్ పలు మార్లు జగద్గిరిగుట్ట నుంచి భగత్‌సింగ్‌ నగర్‌కు వస్తుండడంతో కుమారుడి కారణంగా పదే పదే ఇంటికి వస్తున్నాడని, తన కుమారుడిని ఎలాగైన అంతమొందించాలని తల్లి ఉదయ బాలుడిని వైర్లు, కర్రతో తీవ్రంగా కొట్టింది. దీంతో తల్లి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక సృహ కోల్పొవడంతో బాలుడిని సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న భర్త సురేష్ ఆసుపత్రికి చేరుకుని తన కుమారుడు మృతికి గల కారణం భాస్కర్, తన భార్య ఉదయలు కలిసి హత్య చేశారని ఆరోపిస్తూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Boy died after thrashed by mother in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News