Tuesday, May 21, 2024

గంగవరం పోర్టు కార్మికులకు అన్నివిధాల అండగా బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

కార్మికుల జీవితాలతో పోర్టు యాజమాన్యం చెలగాటం
కార్మిక చట్టాలు అమలయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలి
బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్

మనతెలంగాణ/హైదరాబాద్ : గంగవరం పోర్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించకుండా పోర్టు యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. కార్మికులకు బిఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. గంగవరం పోర్టు నిర్మాణంతో వేటకు దూరమైన మత్సకారుల కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోర్టులో కార్మిక చట్టలను అమలు చేయాలని ప్రశ్నించిన 29 మంది కార్మికులను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వారిని ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయమన్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోర్టు యాజమాన్యం వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించబడిన 29 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేసి,కార్మికులకు రూ.36 వేలు వేతనం చెల్లించేలా జగన్ సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల తొమ్మిది న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఆమోదించేలా ప్రభుత్వం పోర్టు యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని తోట చంద్రశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News