Sunday, April 28, 2024

అద్భుత శిల్పకళా నిలయం బుద్ధవనం

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనం ఒక అద్బుత శిల్ప కళానిలయమని, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. టీఎస్‌ఐఐడీసీ అధికారుల సమావేశాలకు నాగార్జునసాగర్‌లో పర్యటించిన ఆయన గురువారం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య బుద్ధవనంలోని వివిధ పర్యాటక ఆకర్షణలు, వాటి ప్రత్యేకతలను వి వరించారు.

టీఎస్‌ఐఐడీసీ, సీఈవో వి. మధుసూదన్, బుద్దవనాన్ని బుద్ధవనంలో కృష్ణాతీరం వద్ద గల వ్యూపాయింట్‌ను సందర్శించారు. బుద్ధవనంలోని ప్రధాన ఆకర్ణణ అయిన మహాస్థూపం చుట్టూ అలంకరించిన శిల్పఫలాకాల్లోని బుద్దుని జీవితం, జాతక కథలు, బౌద్ధ సంస్కృతి అంశాలను బుద్దవనం, బుద్దిస్ట్ ఎక్సర్ట్ కన్సల్టెంటు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు, కె. సుధన్‌రెడ్డి, డిఆర్ శ్యా ంసుందర్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News