Thursday, May 2, 2024

కేంద్రం గుడ్ న్యూస్.. కోటి గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు, ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామాన్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో భారత దేశం గణనీయమైన అభివృద్ది సాధించబోతుందని పేర్కొన్నారు. భారత్ కు ఆకాశమే హద్దు అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు 70 వేల గృహాలు.. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అంగన్ వాడీ సెంటర్లను అప్ గ్రేడ్ చేశాం.. అంగన్ వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. మధ్య తరగతి ప్రజల కోసం గృహ ప్రణాళిక.. ఆశా వర్కర్లు అందరికి ఆయుష్మాన్ భారత్.. కోటి గృహాలకు సోలార్ రూఫ్ టాప్ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News