Wednesday, May 1, 2024

నడి రోడ్డుపై తుపాకీతో బెదిరించి… నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు

- Advertisement -
- Advertisement -

Businessman robbed in front of his family at gunpoint

 

ఢిల్లీ: ఢిల్లీలోని సరాయి కలేఖాన్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిణి ప్రాంతంలో అమిత్ అరోరా అనే వ్యక్తి ట్రాన్స్ పోర్టు కంపెనీ ఉంది. తన కుటుంబంతో కలిసి ఘజియాబాద్‌లోని ఇందూపురమ్‌లో తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. సరాయి కాలేఖాన్ ప్రాంతంలోని ఐపి పార్క్ సమీపంలోకి రాగానే శుక్రవారం కారు ఆపి మూత్ర విసర్జన రోడ్డు పక్కకు వెళ్లాడు.   మరో కారు వారికి ఎదురుగా ఆపిన దుండగులు అమిత్ ఆరోరా బ్లాంక్ పాయింట్ వద్ద తుపాకీని పెట్టి బెదిరించారు. వారి వద్ద నుంచి 40 వేల నగదు, బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. అమిత్ ఆరోరా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 7805 నంబర్ గల కారులో దుండగులు వచ్చి తమపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News