Thursday, May 2, 2024

2025 నాటికి ఆఫీస్‌లో 25% సమయం మాత్రమే

- Advertisement -
- Advertisement -
By 2025 Employees Will Only Spend 25% Of Time
ఉద్యోగులకు తెలిపిన టిసిఎస్

న్యూఢిల్లీ : దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విషయంలో కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. 25/25 మోడల్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని, దీనికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కంపెనీ సూచించింది. కొత్త విధానం కింద 2025 సంవత్సరం నాటికి 25 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన అవసరం ఉండదు. వారు ఆఫీస్‌లో 25 శాతాని కంటే ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని టిసిఎస్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం 5 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్ నుంచి పనిచేస్తున్నారని, 25/25 మోడల్‌ను అమలు చేయడానికి ముందు ఆఫీస్‌కు వచ్చేందుకు మిగతా వారిని ప్రోత్సహిస్తున్నామని కంపెనీ తెలిపింది. తాము దశల వారీగా, సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ అధికారి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News