Monday, April 29, 2024

దమ్మాయిగూడలో యుబిఐ కొత్త బ్రాంచ్

- Advertisement -
- Advertisement -
Union Bank of India New Branch at Dammaiguda
ప్రారంభోత్సవం చేసిన ఎఫ్‌జిఎం కబీర్ భట్టాచార్య

హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) దమ్మాయిగూడ బ్రాంచ్‌లో కొత్త ప్రాంగణానికి బ్యాంక్ ఎఫ్‌జిఎం కబీర్ భట్టాచార్య ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ రీజియన్ రీజినల్ హెడ్ ఎస్.శ్రీనివాస్ హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేయడం ద్వారా కొత్త బ్రాంచ్‌ను భట్టాచార్య ప్రారంభించారు. ఈ శుభ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్లు దీపాలను వెలిగించడం ద్వారా కొత్త బ్రాంచ్‌కు స్వాగతం చెప్పారు. కబీర్ భట్టాచార్య మాట్లాడుతూ, యూనియన్ బ్యాంక్ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని, విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, సేవలను బ్యాంక్ అందిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News