- Advertisement -
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం సాయంత్రం 6గంటలకు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. సాయంత్రం 6లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. కరోనా బాధిత ఓటర్లకు ఎన్నికల అధికారులు పిపిఇ కిట్లను ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,756 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 97,978, మహిళలు 1,00,778 మంది ఉన్నారు. 315 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 10వ తేదీన ఓట్ల కౌంటింగ్ జరగనుంది. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది.
- Advertisement -