Saturday, April 27, 2024

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. ఇటీవల వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎపిలో తీవ్ర దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ధర్నాలు చేశారు. పవన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పవన్ పై కృష్ణలంకలో సురేష్ అనే వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 405/2023 కింద ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, పవన్ పై సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News