హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దినసరి కూలీలకు నిత్యావసర సరుకులు సిపి సజ్జనార్ పంపిణీ చేశారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు మూడు వేల వాహనాలు సీజ్ చేశామని, 200 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని, లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన లక్షన్నర మందిపై కేసులు నమోదు చేశామన్నారు. సైబరాబాద్ కోవిద్-19 కంట్రోల్ రూమ్కు గురువారం ఒక్కరోజే 12 వేల కాల్స్ వచ్చాయని, సైబరాబాద్ పరిధిలో 300 మంది వాలంటీర్లు పని చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ 127 మందికి సోకగా ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి 14 మంది కోలుకున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగుల సంఖ్య 132కు చేరింది. బుధవారం ఒక్క రోజే 21 కేసులు నమోదయ్యాయి. భారత్ దేశంలో కరోనా వైరస్ 2095 మందికి సోకగా 57 మంది మృత్యువాతపడ్డారు.