- Advertisement -
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కరోనాతో పక్క వార్డులో చికిత్స పొందుతున్న అతని సోదరుడు ఈ విషయం తెలుసుకొని వైద్యులపై దాడి చేశాడు. మరో ముగ్గురు కూడా వైద్యులపై దాడికి దిగారు. దీంతో దాడికి పాల్పడిన పేషెంట్ తోపాటు మిగతా ముగ్గురిపై చిలకలగూడ పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులపై దాడి నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో పోలీసులు భద్రత పెంచారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రులు కెటిఆర్, తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిని క్షమించేదిలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్టర్ ద్వారా కెటిఆర్ హోంమంత్రిని కోరారు.
Police files case against who attacked on Gandhi Doctors
- Advertisement -