- Advertisement -
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ సహాయ మంత్రి రామ్లాల్ రాహి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బాధపడుతున్న రామ్లాల్ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా ధఖరా గ్రామం. హర్గావ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎంఎల్ఎగా గెలిచారు. మిశ్రిఖ్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపిగా గెలిచి పివి నరసింహా రావు ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. మళ్లీ 2019లో బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామ్లాల్ తనయుడు హర్గావ్ నియోజకవర్గం నుంచి బిజెపి తరుఫున ఎంఎల్ఎగా గెలిచారు.
- Advertisement -