Sunday, April 28, 2024

6 ప్రాజెక్టులకు అనుమతి అవసరం లేదు

- Advertisement -
- Advertisement -

కృష్ణా బేసిన్
ప్రాజెక్టులపై
కేంద్రం గెజిట్
నోటిఫికేషన్
రాష్ట్రంలోని
కల్వకుర్తి,
నెట్టెంపాడు
ఎత్తిపోతల
పథకాలకు
కొత్త ఊపిరి

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా రివర్ తెలు గు రాష్ట్రాలకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులను తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కృ ష్ణా నదివెంట ఉన్న ఈ ప్రాజెక్టులకు ఏడాదిలోపు అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్ధనల మేరకు ఈ ఆరు ప్రాజెక్టులకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని క్లాజ్‌లను సవరించింది.ఈ మేరకు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉ న్న ఎత్తిపోతల పథకం, ఈ పథకం పరిధిలోని పంప్‌హౌస్, పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం కింద అదనపు 15టిఎంసిల పనులు, పంప్‌హౌస్, పనులు ఉన్నాయి.

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, ఈ పథకం పరిధిలోని పంప్‌హౌస్ , అనుబంధ పనులు ఉ న్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో తెలుగుగంగ ప్రాజెక్టు, ఈ పథకం పరిధిలోని హెడ్‌వర్క్, గాలేరునగరి సుజల స్రవంతి పథకం , ఈ పథకం పరిధిలోని ప్రధాన పనులు, అనుబంధ పనులు ఉన్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పధకం ఎత్తిపోతల పంప్‌హౌస్ ,అనుబంధ పనులు ఉన్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ పథకం ,ఈ పధకం పరిధిలోని హెడ్‌రెగ్యులేటర్ ,టన్నెల్ , అనుబంధ పనులు ,నల్లమల సాగర్ పనులు ఉన్నాయి. ఈ ఆరు పధకాల పనులకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రజల్‌శక్తిశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News