Sunday, April 28, 2024

నాంపల్లిలో రైలు ప్రమాదం.. పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నాంపల్లిలో రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 50మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

రైలు ప్రమాదంతో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్(47251) మార్గాల్లో వెళ్లే ఎంఎంటీస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News