Wednesday, May 15, 2024

సిఎం రేవంత్‌తో మైక్రాన్ కంపెనీ సిఈఓ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం రేవంత్‌తో మైక్రాన్ కంపెనీ సిఈఓ భేటీ అయ్యారు. ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సిఈఓ సంజయ్ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గురువారం సమావేశమయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సిఎం రేవంత్‌ను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సిఎం నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని సిఈఓ సంతోషం వ్యక్తం చేశారు.

మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ, సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌కు ఆయన భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని తన ఆకాంక్షను రేవంత్ వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ కాగా, మెమరీ చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఇది ఒకటిగా పేరుగాంచింది.

CEO of Micron company met with CM Revanth

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News