Sunday, May 5, 2024

ఛత్తీస్‌గఢ్ సిఎం బఘేల్‌కు కొరడాదెబ్బలు!

- Advertisement -
- Advertisement -

Chhattisgarh CM Baghel whipped

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం ప్రజల సమక్షంలో కొరడా దెబ్బలు చవిచూశారు. దుర్గ్ జిల్లాలోని జంజ్‌గిరి గ్రామంలో దీపావళి మరుసటి రోజున జరిగే గోవర్ధన పూజ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బఘేల్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఆ గ్రామ సాంప్రదాయాన్ని అనుసరించి పచ్చి గడ్డితో చేసిన కొరడాతో దెబ్బలు తిన్నారు. దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆ గ్రామంలో సంప్రదాయం. కొరడా దెబ్బలు తినడం వల్ల సమస్యలు నశించి అదృష్టం వరిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ముఖ్యమ్ంతరి బఘేల్ గోవర్ధన పూజలో పాల్గొని సాంప్రదాయిన్ని అనుసరిస్తూ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కొరడా దెబ్బలను ఓర్చారని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ అధికారి తెలిపారు. గోవులను పూజించడానికి ఉద్దేశించిన ఈ పూజ గోవంశానికి మనం తెలిపే కృతజ్ఞతగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఒక వ్యక్తి చేత చేతిపై కొరడా దెబ్బలు తింటున్న వీడియోను కూడా ముఖ్యమంత్రి బఘేల్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News