- Advertisement -
న్యూఢిల్లీ : చైనా ఫిన్టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్కు పేటీఎంలో వాటాలు ఉన్నాయి. అయితే భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంలో ఉన్న 30 శాతం వాటాను విక్రయించాలని యాంట్ గ్రూప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీకి చెందిన వర్గాల ప్రకారం, ఆసియాలో ఈ రెండు దేశాల మధ్య ఇటీవల పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో చైనా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే అలీబాబాకు చెందిన పేమెంట్ నుంచి కన్జూమర్ క్రెడిస్ సంస్థ యాంట్ ఇంకా ఎలాంటి అమ్మకం ప్రక్రియను ప్రారంభించలేదు. పేటీఎంలో యాంట్ గ్రూప్కు 4.8 బిలియన్ డాలర్ల విలువచేసే వాటా ఉంది.
China fintech giant Ant Group has stake in Paytm
- Advertisement -