Tuesday, April 30, 2024

తేజ్ ఆరోగ్యంపై అభిమానులెవరూ అందోళన చెందొద్దు: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానులు అందోళన చెందొద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శుక్రవారం రాత్రి రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుండి కింద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో తేజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా దగ్గరలోని మెడికవర్‌ ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంపై చిరంజీవి ట్వీటర్ ద్వారా స్పందించారు. సాయి తేజ్ కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటాడని చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నిహారిక, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు సందీప్‌ కిషన్‌ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు. అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ క్షేమంగా ఉన్నాడని తెలిపారు. మరోవైపు సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయి తేజ్‌ గురించి ట్వీట్లు పెడుతున్నారు. ‘బ్రదర్‌ సాయిధరమ్‌తేజ్‌.. త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్‌ అన్నారు. రవితేజ, నిఖిల్‌, మంచు మనోజ్‌, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు సైతం తేజ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Chiranjeevi Respond on Sai Dharam Tej bike Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News