Tuesday, April 30, 2024

లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అనుమతివ్వండి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నారా లోకేష్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీసీఐడీ విజయవాడలోని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనకు అందజేసిన 41ఏ నోటీసులోని షరతులను లోకేష్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో విచారణ అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను జైలుకు పంపుతానని లోకేశ్ బెదిరిస్తున్నాడు. ఇది చాలా అభ్యంతరకరం, కేసు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.

‘రెడ్ బుక్’ వాంగ్మూలాలను సీరియస్‌గా తీసుకోవాలని కోర్టును అభ్యర్థిస్తున్నాం’’ అని సీబీఐ పేర్కొంది. ఐఆర్‌ఆర్‌ కేసులో గతంలోనే లోకేష్‌కు 41ఏ కింద సిఐడి నోటీసులు ఇచ్చింది. 41ఎ నోటీసు నిబంధనల ప్రకారం.. వాటిని అందుకున్న వ్యక్తి దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. తన పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం కనిపించింది. టీడీపీ క్యాడర్‌ను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు, అధికారుల పేర్లు రాస్తున్నారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారిపై సీరియస్‌గా వ్యవహరిస్తామని ఆయన చెబుతున్నారని ఎపిసిఐడి ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News