Saturday, May 11, 2024

నిరుపేదల ఆరోగ్యానికి అండగా సిఎం సహాయ నిధి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ నిరుపేదల ఆరోగ్యాగానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్లసింగారం చెందిన దద్దునూరి రాధ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే సిఎం సహాయ నిధి ద్వారా ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి లబ్ధిదారునికి అందచేశారు. అనంతరం లబ్ధిదారు సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News