Wednesday, May 1, 2024

సిఎం జగన్, అవినాష్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపాడు. జగన్ , అవినాష్ రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో దస్తగిరి వినతిపత్రం సమర్పించాడు. డబ్బుకు అమ్ముడుపోయానని నిరూపిస్తే శిక్షకు సిద్ధం అన్నాడు. నిరూపించకుంటే పదవులకు రాజీనామా చేసి జైలుకెళ్తారా? అని దస్తగిరి ప్రశ్నించాడు. అటు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తొలిరోజు విచారణ నేడు ముగిసింది. దాదాపు ఐదున్నర గంటలపాటు ఇద్దరినీ సిబిఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News