- Advertisement -
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. అయితే ఈ పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షే శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన ఉడుముల జైన్మేరీ, మర్రెడ్డి దంపతుల కురుడైన చరణ్ రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. కాగా, వీరి నిశ్చితార్థం అక్టోబర్లో విద్యానగర్లోని ఓ హోటల్ జరిగింది. డిసెంబర్ 27న బేంగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం నిర్వహించి, 28న పెళ్లి జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ప్రభుత్వ అధికారులు హాజరు అవుతారని వరుడి బంధువులు తెలిపారు.
- Advertisement -