Tuesday, April 30, 2024

బాలు మృతిప‌ట్ల కెసిఆర్, జగన్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR And Jagan Condolence To SP Balu Death

హైద‌రాబాద్: గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కెసిఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఎన్నో సుమ‌ధుర గేయాలు పాడి ప్ర‌జ‌ల అభిమానం సంపాదించారని, బాలు లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిది సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గాయ‌కుడిగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా సేవ‌లు అందించార‌ని కొనియాడారు. ”ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను”అంటూ జగన్ ట్వీట్ చేశారు.  అయితే ఆయన మృతిపై ఇప్పటివకే పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

CM KCR And Jagan Condolence To SP Balu Death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News