- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. ”తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గానగాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎస్పీబీ తుదిశ్వాస విడిచారన్న వార్తతో సినీపరిశ్రమ మూగబోయింది. సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
junior ntr pays tribute to sp balasubramaniam
- Advertisement -